కొత్తగూడెం జిల్లాలో వైన్స్ టెండర్లు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైన్స్ టెండర్లు రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ మేరకు లంబాడీ హక్కుల పోరాట సమితి నేత దేవా నాయక్ పిటిషన్ దాఖలు చేశారు.

పీసా చట్టానికి అనుగుణంగా వైన్స్ టెండర్ల నోటిఫికేషన్ జారీ చేయలేదని పిటిషన్ లో పేర్కొన్నారు.

షెడ్యూల్ ఏరియాలో పీసా చట్టానికి అనుగుణంగా తీర్మానాలు తీసుకోకుండా తెలంగాణ ఎక్సైజ్ శాఖ టెండర్ల నోటిఫికేషన్ జారీ చేసిందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.

వెంటనే టెండర్లు ఆపాలని పిటిషనర్ తరపు న్యాయవాది వెల్లడించారు.ఈ క్రమంలో రేపటి వరకు తెలంగాణ ప్రభుత్వం సమయం కోరింది.

అనంతరం తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

తెలుగు హీరోలకు తెలుగు డబ్బింగ్.. నెట్ ఫ్లిక్స్ విచిత్ర ప్రయోగంపై నెటిజన్ల రియాక్షన్ ఇదే!