Janasena : జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపుపై ఏపీ హైకోర్టులో పిటిషన్
TeluguStop.com
జనసేన ( Janasena )పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో( AP High Court ) పిటిషన్ దాఖలైంది.
ఈ మేరకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ ను దాఖలు చేసింది.
కాగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన ఈ పిటిషన్ కు విచారణ అర్హత ఉందని హైకోర్టు తెలిపింది.
ఈ నేపథ్యంలోనే ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
"""/" / ఎన్నికల నిబంధనల ప్రకారం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు ( Glass Symbol ) కేటాయించడంపై సరికాదని పిటిషన్ దారులు న్యాయస్థానానికి విన్నవించారు.
ఎన్నికల సంఘం గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా కేటాయించిందన్న పిటిషన్ దారులు ఇప్పుడు ఆ గుర్తును జనసేనకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో పాటు జనసేన పార్టీ నిర్వాహకులను పిటిషన్ దారులు ప్రతివాదులుగా చేర్చారు.
కాగా ఈ పిటిషన్ పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.
ఫస్ట్ వీక్ కలెక్షన్లతో ఆ రికార్డును సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఏమైందంటే?