భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది:కలెక్టర్

నల్లగొండ జిల్లా:జిల్లాలోని తిరుమలగిరి (సాగర్) మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పైన పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది.

ఇందులో భాగంగా మండలంలోని చింతలపాలెం గ్రామ శివారులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్,గ్రామసభ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎవరైతే కాస్తు కబ్జాలో ఉంటారో వారి పొలం దగ్గర్నే రేపటి నుంచి సర్వేయర్లు వచ్చి సర్వే చేస్తారని తెలిపారు.

దాని ప్రకారం ప్రతి ఒక్కరికి పట్టా పాస్ పుస్తకాలు అందుతాయన్నారు.ఈ పైలెట్ ప్రాజెక్టు ద్వారా మీ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్,ఆర్డీఓ, ఎమ్మార్వో,సర్వేయర్లు,గ్రామ కార్యదర్శి,రైతులు పాల్గొన్నారు.

బిగ్ బాస్ రెమ్యూనరేషన్ మొత్తం వారికి విరాళంగా ప్రకటించిన బేబక్క?