మునుగోడులో ప్రజలిచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందిః రాజగోపాల్ రెడ్డి
TeluguStop.com
మునుగోడులో ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు.
ఈ ఉపఎన్నిక వ్యక్తి కోసం కానీ, స్వార్థం కోసం కానీ రాలేదన్నారు.తెలంగాణ భవిష్యత్ కోసం, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం వచ్చిందని చెప్పారు.
ఈ క్రమంలో మునుగోడులో బీజేపీ బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
మునుగోడు ప్రజలు న్యాయం వైపు నిలబడి, ధర్మాన్ని కాపాడతారన్నారు.తనపై అసత్యపు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని ధీమా వ్యక్తం చేశారు.
ప్రాణం పోయినా తప్పు చేయనన్న ఆయన.తనపై ఆరోపణలు చేసిన వారు ఆధారాలు చూపించాలని కోరారు.
కాలినడకన వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేష్ ఫ్యామిలీ.. ఏం జరిగిందంటే?