వరుసగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వరుసగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.మండల తహశీల్దార్ జయంత్ కుమార్( Jayant Kumar ) రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలంలో వరుసగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తహశీల్దార్ జయంత్ కుమార్ అన్నారు.

అవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుండి బయటకు రాకుడదని ఆయన అన్నారు.పొంగుతున్న వాగులు వంకల వద్దకు వెళ్లకూడదు అని సెల్ఫి ఫోటోలు దిగడం లాంటివి చేయకూడదని అన్నారు.

వర్షం దాటికి తడిసిన గోడలు ఉన్న ఇండ్లలో ప్రజలు ఎవరూ కూడా అట్లాంటి ఇండ్లలో నివాసం ఉండకూడదు అని ప్రజాప్రతిినిదులు అప్రమత్తంగా ఉండాలని మండల తహశీల్దార్ జయంత్ కుమార్ కోరారు.

స్టార్ హీరోలే సగం డబ్బు దోచేస్తున్నారు.. కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు వైరల్!