పెనమలూరు టీడీపీలో కొనసాగుతున్న సీటు పంచాయితీ

బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, వల్లభనేని వంశీతో నాకు ఎటువంటి సంబంధాలు లేవు.

పట్టాభిపై, పార్టీ కార్యాలయంపై దాడి ప్రయత్నాలు చేస్తున్నారని ముందే చెప్పాను.నాకు వంశీ, కొడాలి తో సత్సంబంధాలు ఉంటే నేను ఎందుకు చెబుతాను వంశీ, నానితో సంబంధంలేదని నా పిల్లల మీద ప్రమాణాలు చేసి చెబుతున్నాను భువనేశ్వరి మీద వంశీ ఆరోపణలు చేసినపుడే సర్వస్వం కోల్పోయావని వంశీకి మెసేజ్ చేశాను పార్టీ కోసం పని చేయటమే నాకు తెలుసు పని చేయటం రాని వాళ్ళు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు పోటీ చేయటం కోసం ఇలాంటి ప్రచారాలు చేయాలా ఎన్నికల్లో పోటీపై బోడే ప్రసాద్ కీలక వ్యాఖ్యలు.

టీడీపీ టికెట్ నాకే వస్తుందని ఇప్పటికీ నమ్ముతున్నాను అధిష్టానం తీసుకునే నిర్ణయం బట్టి నేను పోటీ చేసే విషయం ఆధారపడి ఉంటుంది బాధలో నేను ఏదైనా మాట్లాడి ఉంటే అధిష్టానాన్ని క్షమాపణలు కోరుతున్నాను నాకంటే బెటర్ అభ్యర్ధి దొరుకుతారని పార్టీ సర్వే చేస్తున్నారని భావిస్తున్నాను ఖచ్చితంగా టికెట్ నాకే ప్రకటిస్తారని నా నమ్మకం అన్నం తినేవాడు ఎవరైనా వైసీపీలో చేరతారా అని వంశీ అన్నాడు.

నేను, బోండా ఉమా కూడా వంశీ తో మాట్లాడటం లేదు మేం కలవటం ఎవరైనా చూస్తే దమ్ముంటే చెప్పాలి.

రూ.83 లక్షలు ఆఫర్ చేసినా.. వెయిటర్ జాబ్ వదిలేయలేదు..??