సపాయి కార్మికులకు మద్దతుగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ

రాజన్న సిరిసిల్ల జిల్లా: బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు వర్దవెళ్లి స్వామి గౌడ్( Swami Goud ) అధ్వర్యంలో ఈ రోజు గ్రామ పంచాయితీ సపాయి కార్మికులకు మద్దతుగా రగుడు అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టరెట్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించి గ్రామ పంచాయితీ కార్మికులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలియజేసారు.

తదనంతరం కలెక్టర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి భాను , జిల్లా ఇంఛార్జి లు బట్టు రామచంద్రం, మ్యాకల మునిందర్ ముఖ్య అతిథిలుగా పాల్గొనగా జిల్లా ఉపాధ్యక్షులు చంద్రు నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు మహేందర్, జిల్లా ప్రచార కార్యదర్శి యారపు రాజబాబు, జిల్లా కోశాధికారి జిల్లా నాయకులు తాటిపల్లి అంజయ్య, అరికాల రమేష్,, వేములవాడ నియోజకవర్గ, సిరిసిల్ల అసెంబ్లీ ఉప అధ్యక్షులు నంద్యా నాయక్, ఉపాధ్యక్షులు మెరుగు రాజు, మండల అధ్యక్షులు గుండు ప్రేమ్ కుమార్, నీరటి భాను, పొత్తూరి మల్లేశం టౌన్ అధ్యక్షులు తడక భాను, ఉపాధ్యక్షులు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీకి కేటీఆర్ … వెంట 20 మంది ఎమ్మెల్యేలు ?