నేనేం చేసినా సొంతంగానే చేశాను.. నేను స్టార్ కిడ్ కాదు.. పాయల్ కామెంట్స్ వైరల్!

కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఆది సాయికుమార్, పాయల్ రాజ్ పూర్తి జంటగా నటించిన తాజా చిత్రం తీస్ మార్ ఖాన్.

ఈ సినిమా ఆగస్టు 19న విడుదల కానుంది.ఈ సందర్భంగా తాజాగా చిత్ర బంధం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ.పిలవగానే వచ్చిన అడవి శేషు కు సెల్యూట్.

అలాగే సిద్దు జొన్నలగడ్డ ఇలా రావడం ఆనందంగా ఉంది.నేను సుధీర్ బాబు కలిసి మళ్లీ తండ్రి కొడుకుల నటించబోతున్నాము.

మా అబ్బాయి నటించిన ప్రేమ కావాలి అంటూ వచ్చాడు.ఇప్పుడు తీస్ మార్ ఖాన్ అంటూ ముందుకు రాబోతోన్నాడు.

ఈ టీం అందరికీ థాంక్స్ అని చెప్పుకొచ్చాడు సాయి కుమార్.అనంతరం హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ.

పిలవగానే ఈవెంట్‌కు వచ్చిన అడివి శేష్, సుధీర్ బాబు, సిద్దులకు థాంక్స్.సినిమాలో మంచి ఎమోషన్‌ ఉంటుంది.

మంచి స్క్రిప్ట్.మీకు నచ్చితే ఓ పది మందికి చెప్పండి.

పాయల్ మంచి సహనటి.సునీల్ అన్న చేసిన చక్రి అనే పాత్ర అద్భుతంగా ఉంటుంది.

అందరూ అద్భుతంగా నటించారు.నన్ను కొత్తగా ప్రజెంట్ చేసిన కల్యాణ్‌కు థాంక్స్ అని తెలిపాడు ఆది సాయికుమార్.

"""/" / అలాగే ఈ సందర్భంగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ.

నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను.నా సినిమా రిలీజ్ అయ్యే టైంలో కాస్త నెర్వస్‌గా ఉంటాను.

అది అందరికీ సహజంగానే ఉంటుంది.మా సినిమా టీజర్, ట్రైలర్, పాటలు అన్నింటికి విశేషమైన స్పందన వచ్చింది.

అలాగే మా సినిమాకు మీ ప్రేమ దక్కినందుకు మాకు సంతోషంగా ఉంది.నేనేం స్టార్ కిడ్‌ను కాదు.

నేను ఏం చేసినా నా సొంతంగానే చేశాను.అది మీ ప్రేమ, అభిమానం వల్లే చేయగలిగాను.

ఈ సినిమా నాకెంతో స్పెషల్.మూడేళ్ల తరువాత నా సినిమా థియేటర్లోకి వస్తోంది.

ఈ సినిమాలో ట్విస్ట్‌లు అద్భుతంగా ఉంటాయి అని చెప్పుకొచ్చింది పాయల్‌ రాజ్‌పుత్.

సీఎం జగన్ పై రాళ్లదాడి ఘటనలో పోలీసు అధికారులపై వేటు..!!