జనసేన ఆవిర్భావ సభ కోసం ఖరారైన పవన్ షెడ్యూల్..!!

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మార్చి 14వ తారీకు మచిలీపట్నంలో జరగనుంది.ఇది పదవ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.

2014 మార్చి 14వ తారీకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడం జరిగింది.

దీంతో ఇప్పుడు పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి జనసేన నాయకులు రెడీ అయ్యారు.

ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకకు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఖరారు అయింది.

14 వ తారీకు జరిగే ఆవిర్భావ దినోత్సవానికి హాజరుకానున్న పవన్ కళ్యాణ్ ముందుగా శనివారం మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకొనున్నారు.

ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో బీసీ సదస్సులో పాల్గొననున్నారు.ఆ తర్వాత 12వ తారీకు హరి రామయ్య జోగయ్యతో పాటు కాపు నేతలతో సమావేశం అవుతారు.

13వ తారీకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలవనున్నారు.14వ తారీకు జరగబోయే మహాసభకు మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయం నుండి వారాహి వాహనం ద్వారా.

వేదిక వద్దకు పవన్ చేరుకుంటారు.అయితే ఈ పదవ ఆవిర్భావ దినోత్సవ సభ కార్యక్రమంలో.

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పొత్తుల విషయంలో పవన్ క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

రతన్ టాటా అంటే ఒక నమ్మకం, ఒక నిజాయితీ, ఒక అచ్చమైన భారత “రతన్‌”..!