పవన్ నిర్ణయాలను జనసేన కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నారు..: ఆమంచి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత ఆమంచి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

పవన్ నిర్ణయాలను జనసేన కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.టీడీపీతో పొత్తుతో కాపులకు ఏం ప్రయోజనం అని ఆమంచి ప్రశ్నించారు.

కాపు కులాన్ని టీడీపీకి అంటగట్టు ప్రయత్నం చేయొద్దని తెలిపారు.ఈ క్రమంలోనే వైసీపీకి భావజాలం లేదని చెప్పడం సబబు కాదని పేర్కొన్నారు.

ఏనాడు గెలవని పవన్ కల్యాణ్ జగన్ ను విమర్శించడం దారుణమని తెలిపారు.అటు పురందేశ్వరి పూటకో పార్టీ మారుతూ విమర్శలు చేస్తారని దుయ్యబట్టారు.