వాళ్ళతో కాస్త జాగ్రత్త పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలునీ కుదిపేస్తున్నాయి.కొద్ది నెలల క్రితం వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా జాగ్రత్త పడదామని చెప్పిన పవన్ మొన్న పొత్తుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మూడు ఆప్షన్ లు అంటూ పవన్ పొత్తుల గురించి చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాలలో అప్పుడే ఎన్నికల వాతావరణాన్ని తీసుకొచ్చినట్లు పరిస్థితి మారింది.

ఇటువంటి తరుణంలో తాజాగా పవన్ సోషల్ మీడియాలో సంచలనం పోస్ట్ పెట్టారు."అప్పటివరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడడం ప్రారంభిస్తారని, అయితే ఆ పొగడ్తలు చూసి ఆ నాయకుడు మారిపోయాడని, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు కొట్టి, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్టేనని స్పష్టం చేశారు.

అప్పటివరకు తిట్టిన నాయకులు ఇప్పుడెందుకు పొగుడుతున్నారో ఆలోచించాలని పిలుపునిచ్చారు.పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి.

అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తించండి.జర భద్రం!" అంటూ పవన్ హెచ్చరించారు.

వికటించిన ఏజ్ రివర్స్ ప్రయత్నం.. ఈ కోటీశ్వరుడు ఎలా మారాడో చూడండి..!