ఏడేళ్లకిందట డిస్కస్ చేసిన కథతో మళ్ళీ పవన్-త్రివిక్రమ్ కాంబో.!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియాలో చాలా చురుగ్గా వుంటున్నారు.

ఇలా ఇంతకు మునుపు ఎప్పుడూ ఆయన అలా కనిపించలేదు.ఇప్పుడే ఎందుకో తెలుసా.

ఈ సారి ఆయన పుట్టిన రోజుకు అభిమానులతో పాటుగా ఎంతో మంది సినీ ప్రముఖులు వేల సంఖ్యలో బెస్ట్ విషెస్ చెప్పారు.

దాన్ని పవన్ ఏ మాత్రం లైట్ తీసుకోకుండా ప్రతీ ఒక్కరికీ రిప్లై ఇస్తూ వస్తున్నాడు.

ఈ సందర్భంగా.సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కూడా అభిమానులకు ఏ స్థాయిలో కిక్కిచ్చాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.

పవర్ స్టార్ పింక్ రీమేక్ అయినటువంటి వకీల్ సాబ్ సినిమాతో పాటు వరుసగా నాలుగు సినిమాలను క్యూలో పెట్టాడు.

ఇప్పటికే వకీల్ సాబ్ మూవీ ఎండింగ్ దశలో ఉండగా.ఇక క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న పిరియాడిక్ మూవీ షూటింగ్ కూడా కొంత పూర్తి చేసినట్లు భోగట్టా.

ఆ సినిమా కొనసాగింపు త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు.ఇకపోతే గబ్బర్ సింగ్ దర్శకుడు అయినటువంటి హరీష్ శంకర్ తో కలిసి చేయబోతున్న కాన్సెప్ట్ సినిమా పోస్టర్ పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల అయ్యి, అభిమానులను అలరించింది.

దాని తదుపరి సినిమా యాక్షన్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో వుండబోతోంది.ఇక ఆ సినిమాకు వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు.

దాంతో పవన్ 29వ సినిమా లైన్ లో పెట్టాడు.ఇక పవన్ 30వ ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని చూస్తున్నాడట.

అందుకోసం త్రివిక్రమ్ ని కలిసాడని, ఏడేళ్ల క్రితం డిస్కస్ చేసి ఆగిపోయిన 'కోబలి' అనే మెస్సేజ్ ఓరియెంటెడ్ సినిమా కథను లైన్ లో పెడుతున్నాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాళ్లు చేతులు నల్లగా మారాయా.. ఈ సింపుల్ రెమెడీతో తెల్లగా మెరిపించుకోండి!