మరోసారి బయటపడ్డ పవన్ క్రేజ్.. పవన్-సుజీత్ ప్రాజెక్ట్ ప్రకటనతో సోషల్ మీడియా షేక్!

మన టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అన్న మెగాస్టార్ కంటే కూడా పవన్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మరి పవన్ కు ఎంత క్రేజ్ ఉందో నిన్న మరోసారి నిరూపితం అయ్యింది.

అసలేం జరిగింది అంటే.నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం కొన్నాళ్ళ నుండి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.సెకండ్ ఇన్నింగ్స్ లో వకీల్ సాబ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈయన బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ సైన్ చేస్తూ ఫ్యాన్స్ ను మెప్పించాడు.

అయితే పవన్ ఎన్ని సినిమాలను లైన్లో పెట్టినా వాటిని పూర్తి చేయడంలో మాత్రం విఫలం అవుతున్నాడు.

చేతిలో ప్రాజెక్టులు ఉండగానే నిన్న మరో ప్రాజెక్ట్ ను ప్రకటించారు.ఒకపక్క పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా పూర్తి కాకుండానే కొత్త సినిమా అనౌన్స్ చేసారు.

నిన్న ఉదయం దిగ్గజ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటెర్టైనమెంట్స్ నుండి ఒక క్రేజీ అనౌన్స్ మెంట్ రావడంతో అంతా ముందు షాక్ అయ్యారు.

ఆ తర్వాత ఈ క్రేజీ వార్తను ఎంజాయ్ చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ మరియు యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావడంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు.

ఈ పోస్ట్ అనౌన్స్ మెంట్ రావడంతో నిన్నటి నుండి సోషల్ మీడియా షేక్ అవుతుంది.

ఈ పోస్ట్ బాగా వైరల్ అయ్యింది. """/"/ ఈ పోస్ట్ కి దాదాపు 44 కే కి పైగానే లైక్స్ ను సొంతం చేసుకుంది.

దీంతో పవన్ కళ్యాణ్ క్రేజ్ మరోసారి నిరూపితం అయ్యింది.సుజీత్ సాహో సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు.

మరి ఆ సినిమా తర్వాత పవర్ స్టార్ ను లైన్లో పెట్టడం అందరిని ఆశ్చర్యం కలిగించే విషయం అనే చెప్పాలి.

మొత్తానికి పవన్, సుజీత్ కాంబోలో ఒక సెన్సేషన్ మూవీనే రాబోతుంది అని తెలుస్తుంది.

మరి ఈ క్రేజీ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుందో చూడాలి.

Bandi Sanjay : చెంగిచర్లలో రోహింగ్యాల మాఫియా దందా అరికట్టాలి..: బండి సంజయ్