బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ డుమ్మా.. బదులుగా ఎవరు రాబోతున్నారంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Klayan ) ఫ్యాన్స్ జులై 28 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఎందుకో అందరికి తెలుసు.ఎందుకంటే పవర్ స్టార్ కీలక రోల్ లో నటించిన 'బ్రో ది అవతార్'( Bro Movie ) సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతుంది.

పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఉన్నారు.

మరో నెల రోజుల్లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.దీంతో మేకర్స్ కూడా వరుస ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగానే టీజర్ రిలీజ్ చేసారు.మెగా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి నిన్న వచ్చిన ఈ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది.

రీమేక్ అయినప్పటికీ త్రివిక్రమ్ చేయి పడడంతో స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేసినట్టు టీజర్ చూస్తుంటే అర్ధం అవుతుంది.

"""/" / త్రివిక్రమ్( Trivikram ) మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా సముద్రఖని ఈ సినిమాను తెరకెక్కించారు.

మరి ఈ బిగ్ అప్డేట్ తర్వాత ఈ సినిమా నుండి రాబోతున్న మరో అప్డేట్స్ ఏమున్నాయంటే ట్రైలర్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది.

మరి తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ హాజరవ్వక పోవచ్చు అని టాక్ వస్తుంది.

మరి పవర్ స్టార్ డుమ్మా కొట్టినప్పటికీ ఈయనకు బదులుగా మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన కుమారుడు రామ్ చరణ్ తేజ్ కూడా వచ్చే అవకాశం ఉందని తాజా రూమర్స్.

సాయి తేజ్( Sai Dharam Tej ) కూడా ఉన్నాడు కానీ గెస్టులుగా వీరే వస్తారని టాలీవుడ్ వర్గాల్లో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

చూడాలి ఈ విషయంపై ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో. """/" / ఇక ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ( Ketika Sharma ) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్ తో కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

కాగా ఈ సినిమా జులై 28న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

చూడాలి ఈ రీమేక్ మూవీ ఇక్కడ ఎలా ఆకట్టు కుంటుందో.

రూ.83 లక్షలు ఆఫర్ చేసినా.. వెయిటర్ జాబ్ వదిలేయలేదు..??