ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరికి.. పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు..!!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ( BJP ) నూతన అధ్యక్షురాలిగా నియమించబడిన పురందేశ్వరికి( Purandheswari ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

"భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పదవికి నియమితులైన శ్రీమతి డి.

పురందేశ్వరి గారికి హృదయపూర్వక అభినందనలు.కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన శ్రీమతి పురందేశ్వరి గారు కొత్త బాధ్యతలలో విజయవంతంగా ముందుకు వెళ్తారనే భావన ఉంది.

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు పరిరక్షించే దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షిస్తున్నాను".అంటూ పవన్ తన శుభాకాంక్షలు తెలియజేశారు.

"""/" / ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి జనసేన మిత్రపక్షంగా వ్యవహరిస్తూ ఉంది.

దీంతో అధ్యక్ష బాధ్యతల నుండి సోము వీర్రాజుని( Somu Veerraju ) తప్పించి పురందేశ్వరినీ నియమించడంతో ఏపీలో సరికొత్త రాజకీయ వాతావరణం నెలకొంది.

ఒక్కసారిగా బీజేపీ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకోవడం తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.

అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి నియమితులైన కిషన్ రెడ్డికి కూడా పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

బీజేపీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం.రెండు తెలుగు రాష్ట్రాలలో అధ్యక్షుల మార్పుతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.

ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎందుకు ప్లాప్ సినిమాలను చేస్తున్నారు…