ఉస్తాద్ నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్ ఇచ్చిన హరీష్.. ఎప్పటి నుండి అంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

ఈ కాంబో అంటే టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది ఈ కాంబో లోనే కావడంతో మరోసారి ఈ కాంబో ఎప్పుడు వస్తుందా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

2012లో గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.మరి ఎట్టకేలకు ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా రాబోతుంది.

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''ఉస్తాద్ భగత్ సింగ్'' ( Ustaad Bhagat Singh ).

ఇన్నాళ్లకు మళ్ళీ ఈ బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ అవుతుండడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

"""/" / ఇక ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి అయింది.

ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా పవర్ స్టార్ మరోసారి ఖాకీ చొక్కా వేయడంతో మరింత హైప్ పెరిగింది.

ఇక ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ గురించి ఒక అప్డేట్ తెలుస్తుంది.తమ మూవీ యొక్క పవర్ ప్యాక్డ్ నెక్స్ట్ షెడ్యూల్ గురించి హరీష్ ఒక అప్డేట్ ఇచ్చారు.

"""/" / నెక్స్ట్ పవర్ ప్యాక్డ్ షెడ్యూల్ కోసం సిద్ధం అవుతున్నాం అంటూ హరీష్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, సినిమాటోగ్రాఫర్ బోస్ లొకేషన్స్ సర్చింగ్ లో భాగంగా దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఈ విషయాన్నీ తెలిపారు.

ఉస్తాద్ తో పాటు ఓజి సినిమాల అప్డేట్ లు కూడా వెంటవెంటనే రావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా ఇళయ దళపతి విజయ్ నటించిన సూపర్ హిట్ తేరీ సినిమాకు అఫిషియల్ గా రూపొందుతుంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలాగే శ్రీలీల (SreeLeela) హీరోయిన్ గా నటిస్తుండగా.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

అమెరికాలో నేపాలీ యువతి దారుణహత్య .. పోలీసుల అదుపులో భారత సంతతి వ్యక్తి