సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ యాక్టివిటీస్ కి కొంత దూరంగా ఉంటూ సినిమాల మీద ఫోకస్ పెట్టాడు.

ఈ నేపధ్యంలో ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా మెజారిటీ షూటింగ్ కంప్లీట్ చేసేశాడు.

ఈ సినిమా కొంత భాగం ఇంకా పెండింగ్ లో ఉంది కరోనా పరిస్థితుల కారణంగా అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియడం లేదు.

అయితే ఇప్పటికే మరో ఇద్దరు దర్శకులని పవన్ కళ్యాణ్ లైన్ లో పెట్టాడు.

అందులో క్రిష్ మూవీ పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది.దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంటుంది.

ఈ రెండు ఎప్పటికి మొదలు అవుతాయో అర్ధం కాని విషయం.అయితే పవన్ కళ్యాణ్ చేయబోయే దర్శకుల జాబితా రోజు రోజుకి పెరిగిపోతుంది.

చాలా మంది అతనితో సినిమాలు చేయడం కోసం వేచి చూస్తున్నారు.ఇప్పుడు ఈ జాబితాలోకి సురేందర్ రెడ్డి కూడా వచ్చి చేరాడు.

క్రిష్, హరీష్ శంకర్ సినిమాలు పూర్తి చేసిన తర్వాత సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తాడని టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ సినిమా కోసం స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఇప్పటికే అదిరిపోయే కమర్షియల్ స్టొరీ సిద్ధం చేశాడని, ఆ స్టొరీని పవన్ కళ్యాణ్ కి కూడా వినిపించడం జరిగిందని టాక్ గట్టిగా వినిపిస్తుంది.

ఈ కథతోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తాడని చెప్పుకుంటున్నారు.మెగా కాంపౌండ్ లో ఇప్పటికే దృవ్, సైరా, రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన సురేందర్ పవన్ కళ్యాణ్ తో కూడా చేస్తే మెగా స్టార్ హీరోలతో సినిమాలు చేసినవాడు అవుతాడు.

ఇదిలా ఉంటే సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమాని అఖిల్ తో చేయడం ఇప్పటికే అఫీషియల్ కనర్మేషన్ అయ్యింది.

ఆ పార్టీలో బీఆర్ఎస్ విలీనం ? 6న ముహూర్తం