రచయితగా మారుతున్న పవన్ కళ్యాణ్.. ఆ మూవీ కోసమే..?

అజ్ఞాతవాసి సినిమా తరువాత రాజకీయాల్లో బిజీ కావడం వల్ల కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండగా ఈ సినిమా సమ్మర్ లో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

వకీల్ సాబ్ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా పవన్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కే ఒక సినిమాలో నటిస్తున్నారు.

"""/"/ మలయాళంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్టైన అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కథ, కథనాల్లో మార్పులు చేర్పులు చేస్తూ తన పెన్ పవర్ ను చూపిస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాకు పవన్ రచయితగా వ్యవహరించనున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుండగా టైటిల్స్ లో రచయితగా పవన్ కళ్యాణ్ పేరు కనిపిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

సాగర్ చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలలో సహాయసహకారాలు అందిస్తున్నట్టు తెలుస్తోంది.

"""/"/ పవన్, రానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది సెకండాఫ్ లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మల్టీస్టారర్ సినిమా కావడంతో పవన్ ఫ్యాన్స్ తో పాటు రానా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ను తక్కువ రోజుల్లోనే పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడని తెలుస్తోంది.

దర్శకుడు సాగర్ చంద్ర ఇప్పటికే కథను తెలుగు నేటివిటీకి తగిన విధంగా కీలక మార్పులు చేసినట్టు తెలుస్తోంది.

సాగర్ చంద్ర అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలకు గతంలో దర్శకత్వం వహించారు.ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోయినా దర్శకునిగా సాగర్ చంద్రకు మంచిపేరు తెచ్చిపెట్టాయి.

నాలుగేళ్లలోనే పోలీస్ అవతారం ఎత్తాడు.. కేసులు సాల్వ్ చేశాడు..?