సుజీత్ డైరెక్షన్ కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిటింగ్.. ఎందుకంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో వకీల్ సాబ్ తో స్టార్ట్ చేసి ఆ తర్వాత కూడా వరుస సినిమాలను లైన్లో పెట్టడంతో ఫ్యాన్స్ అంతా ఖుషీ గా ఉన్నారు.

సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా ఫాస్ట్ గా చేస్తాడు అని భావించారు.కానీ రోజురోజుకూ ఈయన సినిమాలను ఒదిలేసి రాజకీయాల మీదనే ఫోకస్ చేస్తూ రావడంతో ఇక కొత్త సినిమాలు ఒప్పుకోడు అని అనుకున్నారు.

అయితే ఈయన చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయకుండానే మరో సినిమాను ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు.

ప్రెజెంట్ పవన్ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి.పవన్ చేస్తున్న సినిమాల్లో ''హరిహర వీరమల్లు'' ఒకటి.

ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.

ఇక పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో కూడా సినిమా తెరకెక్కనుంది.

ఈ క్రేజీ కలయికలో ''భవదీయుడు భగత్ సింగ్'' సినిమాను ప్రకటించారు.అయితే ఈ ప్రాజెక్ట్ ప్రకటనకు మాత్రమే పరిమితం అయ్యింది.

ఇలా చేతిలో ఉన్న రెండు సినిమాలు పూర్తి అవ్వకుండానే మరో కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది.

దిగ్గజ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటెర్టైనమెంట్స్ నుండి ఒక క్రేజీ అనౌన్స్ మెంట్ రావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి చాలా కాలం తర్వాత ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసింది.

"""/"/ పవన్ కళ్యాణ్ మరియు యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావడంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు.

ఈ ప్రాజెక్ట్ కోసం పవన్ ఫ్యాన్స్ మరింతగా ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇప్పటికే ఒక ప్రాజెక్ట్ చూసారు కాబట్టి ఇప్పుడు యంగ్ డైరెక్టర్ పవన్ ను ఎలా డైరెక్ట్ చేస్తాడా అని ఎదురు చూస్తున్నారు.

దీంతో ఈ సినిమాపై ప్రత్యేకంగా భారీ అంచనాలు పెట్టుకున్నారు.మొత్తానికి పవన్, సుజీత్ కాంబోలో ఒక సెన్సేషన్ మూవీనే రాబోతుంది అని తెలుస్తుంది.

మరి ఈ క్రేజీ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుందో చూడాలి.

కేజ్రీవాల్ అరెస్ట్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈడీ కౌంటర్ ఫైల్..!