వైసీపీనీ గద్దె దించడమే లక్ష్యం పవన్ సంచలన వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం నుండి విజయవాడ చేరుకుని తర్వాత మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా విశాఖ గార్జన ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నామని తెలిపారు.

మా అంతర్గత కార్యక్రమాలు వైసీపీకి ఎలా చెబుతామని ప్రశ్నించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వైసీపీని విముక్తి చేయటమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

వైసీపీ విముక్త కోసమే వచ్చే ఎన్నికలలో పోరాటం చేస్తాం.వైసీపీ విముక్తా ఏపీ జరగకపోతే తెలంగాణ రాష్ట్రం కూడా నష్టపోతుంది.

"""/"/ వైసీపీతో తేల్చుకుంటాం గద్దె దించుతాం.ఆ దిశగానే అడుగులు వేస్తాం.

కులం, ప్రాంతం, మతం అని విడిపోయి కొట్టుకుంటుంటే అభివృద్ధి ఎక్కడుంటుంది.? ఇటువంటి విషయాలపై ప్రజలు కూడా కాస్త ఆలోచించాలి అని పవన్ సూచించారు.

 వైసీపీ ఉడత ఊపులకు తాటాకు చప్పుళ్లకి ఎవరు భయపడారని పేర్కొన్నారు.ప్రభుత్వంలో ఉండి ఎవరైనా గర్జిస్తారా.

? అధికారానికి దూరంగా ఉన్నవారు గర్జిస్తారు అంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

అమెరికాను వణికిస్తున్న ‘హెలెనా ’ .. 64 మంది మృతి, 146 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో!!