కార్తీ లడ్డు వివాదం పై మరోసారి రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్.. ఏమన్నారంటే?

తిరుపతి లడ్డు ( Tirupathi Laddu ) వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుంది.

తిరుపతి లడ్డు తయారీలో కల్తీ జరిగిందంటూ ఆరోపణలు చేయడంతో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు 11 రోజులపాటు చేసిన ఈ దీక్ష నేడు పూర్తి కావడంతో ఈయన తిరుపతికి మెట్లు మార్గాన వెళ్లి స్వామి వారిని దర్శించుకున్న అనంతరం దీక్ష విరమణ చేశారు.

ఇకపోతే తిరుపతి లడ్డు వ్యవహార పై పలువురు సినిమా సెలబ్రిటీలు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా హీరో కార్తీ ( Karthi ) చేసిన వ్యాఖ్యలను ఈయన తప్పుపట్టారు.

"""/" / హీరో కార్తీ తన సినిమా ప్రమోషన్లలో భాగంగా లడ్డు ప్రస్తావన రావడంతో లడ్డు ప్రస్తుతం సెన్సిటివ్ ఇష్యూ గురించి మాట్లాడకపోవడమే మంచిదని కామెంట్ చేయడంతో అక్కడున్న వారందరూ నవ్వారు.

అయితే ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకు వెళ్లడంతో ఆయన కార్తీ వ్యాఖ్యల పట్ల మండిపడ్డారు దీంతో కార్తీ క్షమాపణలు కూడా చెప్పారు.

అయితే తాజాగా మరోసారి కార్తీ గురించి పవన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

"""/" / కార్తీ, సూర్య ( Suriya ) ఇద్దరూ భక్తులే, వాళ్ళు కూడా తిరుమలకు వెళ్లారు.

కార్తీ గారు కావాలని అలా మాట్లాడలేదు.కానీ అయన అనుకోకుండా అలా మాట్లాడటం, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వడంతో అలాంటి ఇష్యూ మీద నెగిటివ్ గా వెళ్ళింది.

వాళ్ళు సెలబ్రిటీ పర్సన్స్ కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి.మనల్ని చూసి ప్రజలు ఫాలో అవుతారు.

అందుకే ఆ రోజు అలా మాట్లాడానని పవన్ తెలిపారు తమిళ సినీ ఇండస్ట్రీలో హీరోలు నాకు సోదర సమానులు అంటూ పవన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కోడి పోయిందంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బుడ్డోడు.. అతడి మాటలు వింటే..