వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ అయిన పవన్ కళ్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ అయ్యారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

రోడ్ల విషయంలో ప్రశ్నిస్తుంటే.పోలీసు కేసులతో పాటు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

రాజకీయాలకతీతంగా ఏపీలో రోడ్ల సమస్య విషయంలో ప్రభుత్వం స్పందించాలని పవన్ సూచించారు.ఈ విషయంలో ప్రభుత్వం అక్టోబర్ రెండవ తారీఖు లోపు స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా శ్రమదానం నిర్వహించి రోడ్లు మరమ్మతుల కార్యక్రమం చేపడతానని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ తమ ప్రాంతాలలో ఉండే రోడ్ల పరిస్థితి ఫోటోలను సోషల్ మీడియాలో సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఐదు తారీకులలో పోస్ట్ చేసి ప్రభుత్వానికి నిరసన సెగ తగిలేలా చేయాలని తెలిపారు.

గతంలో తుఫాన్ పర్యాటక ప్రాంతాల్లో పర్యటించిన సమయంలోనే ఏపీలో భయంకరంగా రోడ్ల పరిస్థితి ఉందని అప్పటినుండి ఇప్పటివరకు ఏపీలో రోడ్ల విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని వైసీపీ ప్రభుత్వం పై పవన్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

శనగ పంటలో పోషక ఎరువుల యాజమాన్యం.. పంట విత్తుకునే విధానం..!