భారీగా పెరిగిన వీరమల్లు బడ్జెట్.. మరి పవన్ రాబట్టగలడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.

ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.ప్రస్తుతం పవన్ వరుస సినిమాలను లైన్లో పెడుతూ స్పీడ్ పెంచేస్తున్నాడు.

ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో 'హరి హర వీరమల్లు' సినిమా ఒకటి.

ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిన షూటింగ్ ఇటీవలే స్టార్ట్ చేసారు.కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి చేస్తున్నాడు క్రిష్.

ఇంకా 40 శాతం షూటింగ్ మిగిలి ఉండడంతో జూన్ లేదా జులై లోపు ఈ సినిమా మొత్తాన్ని పూర్తి చేయాలనీ పవన్ భావిస్తున్నాడు.

అందుకే ఫాస్ట్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు.పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందిఅని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నప్పటికీ ఈ సినిమా బడ్జెట్ ఎంతో ఎవ్వరికి తెలియలేదు.

కానీ తాజాగా ఈ సినిమా బడ్జెట్ గురించిన ఒక వార్త నెట్టింట్లో వైరల్ అయ్యింది.

తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ అనుకున్న దాని కంటే ఇంకా ఎక్కువ పెరిగిందట.

ఈ సినిమాను ముందుగా 150 నుండి 180 కోట్ల మధ్య నిర్మించాలని అనుకున్నారట.

"""/"/ కానీ ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 200 కోట్లకు చేరుకుందని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తుండడం అందులోను భారీ పీడియాడిక్ సినిమా కావడం వల్ల సెట్స్ కోసం, గ్రాఫిక్స్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుందట.

దీంతో బడ్జెట్ అమాంతం పెరిగింది.మరి పవన్ అంత రాబట్టగలడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

చూడాలి మరి ఈ సినిమా పవన్ కెరీర్ లో ఎంత వసూళ్లు చేస్తుందో.

ఆ టాలెంటెడ్ దర్శకులను చూసి రాజమౌళి అసూయ పడుతున్నారా.. ఏం జరిగిందంటే?