కరోనా బారిన పడ్డ టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్..

దేశంలో థర్డ్ వేవ్ ప్రమాద ఘంటికలు మారుమోగుతున్నాయి.రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి.

ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేస్తూ ఉన్నాయి.చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతూ ఉన్నారు.

తాజాగా తెలుగుదేశం పార్టీ యువనేత పరిటాల శ్రీరామ్ కూడా కరోనా బారిన పడటం జరిగింది.

ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.స్వల్ప లక్షణాలతో తనకు కరోనా నిర్ధారణ అయిందని పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది అని తెలియజేశారు.

ఈ క్రమంలో తనను కలిసిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని ఎవరిలోనైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

 ఒక్క పరిటాల శ్రీరామ్ మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్, ఇంకా చాలా మంది హీరోయిన్లు కరోనా బారిన పడటం జరిగింది.

వ్యాక్సిన్లు వేసుకున్న గాని .కరోనా సోకుతు ఉండటంతో దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి అన్నదానిపై ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు మల్లగుల్లాలు పడుతున్నారు.

కాంగ్రెస్ పేదరికాన్ని పెంచి పోషించింది..: కేంద్రమంత్రి రాజ్‎నాథ్ సింగ్