రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి

వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ఎమ్మెల్యే నివాసంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొన్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మన ఊరు, మన పోరు సభలో అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

చేవెళ్ల ప్రాణహిత ఆపే ప్రసక్తి లేదని లేనిపోని ఆరోపణలు చేయరాదని అన్నారు.పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతామని అన్నారు.

తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏర్పడిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్, ఎంపీపీ అరవిందరావు, జెడ్ పి టి సి హరిప్రియ ప్రవీణ్ కుమార్ రెడ్డి, దోమ జడ్పిటిసి నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

బిగ్ బాస్ హౌస్ లో స్మోక్ చేస్తూ దొరికిన విష్ణుప్రియ.. పరువు మొత్తం పోయిందిగా!