మద్యానికి బానిసైన కొడుకు వేధింపులు భరించలేక హత్య చేసిన తల్లిదండ్రులు..!

ఇటీవలే కాలంలో చెడు వ్యసనాలకు బానిసై కుటుంబ సభ్యుల పట్ల దారుణంగా వ్యవహరిస్తూ వేధించే యువత సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది.

చేతికి అంది వచ్చిన కొడుకు కుటుంబానికి ఆసరాగా ఉంటాడు అనుకుంటే తాగుడుకు బానిసై ఉన్న ఇంటిని అమ్మేయాలని తల్లిదండ్రులను వేధించడంతో.

సుఫారీ ఇచ్చి కన్న కొడుకునే హత్య చేయించిన ఘటన తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాకలో చోటుచేసుకుంది.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.

తెలంగాణలోని భద్రాచలం ( Bhadrachalam In Telangana )మెడికల్ కాలనీలో నివాసం ఉంటున్న పగిల్ల రాము, సావిత్రిలకు( Pagilla Ramu, Savitri ) దుర్గాప్రసాద్ అనే యువకుడు సంతానం.

దుర్గాప్రసాద్ కుటుంబ బాధ్యతలను మరిచి ప్రతిరోజు మద్యం సేవించి కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు.

అతని ప్రవర్తనతో విసిగిపోయిన భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది.డబ్బుల కోసం ఉన్న ఇంటిని అమ్మేయాలని తల్లిదండ్రులను నిత్యం వేధించేవాడు.

"""/" / కన్న కొడుకు వేధింపులు భరించలేకపోయినా తల్లిదండ్రులు సుపారీ ఇచ్చి కొడుకును హత్య చేయించాలని నిర్ణయించుకున్నారు.

భద్రాచలం కు చెందిన షేక్ అలీ పాషా, గుమ్మడి రాజు( Sheikh Ali Pasha , Gummmadi Raju ) అనే వ్యక్తులకు రూ.

3 లక్షల సుపారీ ఇచ్చి కొడుకును హత్య చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు.ఈనెల తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి గాడ నిద్రలో ఉన్న దుర్గా ప్రసాద్ పై తల్లిదండ్రులతో పాటు సుపారీ తీసుకున్న వ్యక్తులు దాడి చేసి కత్తితో మెడ కోసి హత్య చేశారు.

ఆ తర్వాత మృతదేహాన్ని తుమ్మల నగర్ అటవీ ప్రాంతంలోని గానుగ చెట్ల తోటలో పెట్రోల్ పోసి తగలబెట్టారు.

అయితే పదవ తేదీ మధ్యాహ్నం కట్టెల కోసం అడవికి వెళ్ళిన వ్యక్తికి సగం కాలిన శవం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి మృతదేహం ఫోటోతో కర పత్రాలు వేశారు.మృతుని భార్య ఆ ఫోటోలో ఉన్నది తన భర్త అని గుర్తించి పోలీసులను ఆశ్రయించింది.

పోలీసులు కేసు నమోదు చేసి అన్నీ కోణాల్లో దర్యాప్తు చేయగా మృతుడి తల్లిదండ్రులే దోషులని తేలింది.

షాకింగ్ వీడియో: పట్టపగలే నడిరోడ్డుపై మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్ళిన దొంగలు.. జాగ్రత్త సుమీ..