Pankhuri Awasthy : కవలలకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. నెట్టింట పోస్ట్ వైరల్?

ఈ మధ్యకాలంలో సెలెబ్రెటీలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.

మరి కొందరు తల్లి కాబోతున్న విషయాలను సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు.చాలా వరకు సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో ప్రతి ఒక్క సెలబ్రిటీ వారికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా మరో బుల్లితెర సెలబ్రిటీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రముఖ బాలీవుడ్ బుల్లితెర నటి పంకురీ అవస్తీ( Pankhuri Awasthy ) రజియా సుల్తాన్ అనే షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

"""/" / ఈ సీరియల్ తో పాటు మరికొన్ని సీరియల్స్ లో నటించి మెప్పించింది.

ఆ తర్వాత సూర్యపుత్ర కరణ్, మేడమ్ సార్, యే రిస్తా క్యా కెహ్లాతా పై లాంటి సీరియల్స్‌లో కనిపించింది.

సూర్యపుత్ర కరణ్‌ టీవీ షో నటించిన గౌతమ్‌( Gautam )ను ప్రేమ వివాహాం చేసుకుంది భామ.

తాజాగా ఈ జంటకు కవల పిల్లలు జన్మనిచ్చారు.ఈనెల 25న బుల్లితెర భామకు ఒక పాప, బాబు జన్మించినట్లు స్వయంగా ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపింది.

ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చింది.ఆనందం, కృతజ్ఞతతో నిండిన రెండు మనసులు.

ఇప్పుడు నలుగురిగా ప్రయాణం ప్రారంభించబోతున్నాము. """/" / ఈ సందర్భాన్ని ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాను.

మా పట్ల మీ అందరి ప్రేమకు, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు అని రాసుకొచ్చింది.అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సెలబ్రిటీలు అభిమానులు నెటిజెన్స్ ఈ ముద్దుగుమ్మకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇప్పటివరకు గౌహర్ ఖాన్, రాజ్‌పుత్‌ పాయల్‌తో పాటు దివ్యాంక త్రిపాఠి, దేవోలీనా భట్టాచార్జీ, మొహ్సిన్ ఖాన్, అమీర్ అలీ, భారతీ సింగ్ అభినందనలు తెలిపారు.

ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇకపోతే ఈమె కెరియర్ విషయానికి వస్తే.

మొదట రజియా సుల్తాన్ షో ద్వారా పంకురికీ గుర్తింపు దక్కింది.సరస్వతీచంద్ర అనే సీరియల్‌ ద్వారా పేరు తెచ్చుకున్న గౌతమ్.

ఆ తర్వాత సూర్యపుత్ర కరణ్( Suryaputra Karn ) సీరియల్‌లో కలిసి నటించారు.

అదే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.కొన్ని నెలల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 2018లో రాజస్థాన్‌లోని అల్వార్‌ తిజారా ఫోర్ట్ ప్యాలెస్‌లో జరిగిన గొప్ప వేడుకలో పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి జరిగిన ఐదు సంవత్సరాల తర్వాత ఈ జంటకు కవల పిల్లలు జన్మించారు.

చైతన్యలో ఆ లక్షణాలు అంటే ఇష్టమంటున్న శోభిత.. హుందాగా ప్రవర్తిస్తాడంటూ?