పాన్ ఇండియా అనేది కథలో ఉండాలి… పాన్ ఇండియా సినిమాలపై అడవి శేష్ షాకింగ్ కామెంట్స్?

క్షణం, గూఢచారి, ఎవరు వంటి సూపర్ హిట్ చిత్రాలతో థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచినటువంటి నటుడు అడవి శేష్ తాజాగా మరొక త్రిల్లర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

శైలేష్ దర్శకత్వంలో అడివి శేష్ మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం హిట్ 2.

ఈ సినిమా డిసెంబర్ రెండవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అడివి శేష్ పాన్ ఇండియా సినిమాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈయన కూడా మేజర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు.

ఈ ఏడాది మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.

ఈ క్రమంలోనే తన తదుపరి చిత్రం హిట్ 2 ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శేష్ తన సినిమాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/11/pan-india-should-be-in-the-story-ai-sesh-shocking-comments-detailss!--jpg "/ శేష్ తల్లిదండ్రులు అమెరికాలో ఉన్నప్పటికీ ఈయన మాత్రం ఇండియాలో ఉంటూ ఇక్కడ హీరోగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఇక్కడే ఉండి ఇండియన్ సినిమాలు చేస్తుంటానని వెల్లడించారు.ఇక పాన్ ఇండియా సినిమా గురించి మాట్లాడుతూ.

పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ఉంది కదా అని ప్రతి ఒక్క సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయకూడదని మన కథలో పాన్ ఇండియా అనేది ఉన్నప్పుడే ఆ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ఈ సందర్భంగా శేష్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రక్తహీనత నుంచి తొందరగా బయటపడాలనుకుంటే ఈ ఆహారాలను తప్పక తీసుకోండి!