పాల్వాయి ఇంటింటి ప్రచారం

నల్లగొండ జిల్లా:మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూర్ మండలం తుమ్మలపల్లి గ్రామలో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఎస్సీ కాలనీ నెలకొన్న విద్యుత్ సమస్యపై విద్యుత్ అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఊళ్ళో సమస్యలను చూస్తే తెలుస్తుందన్నారు.

పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డగా చెబుతున్నా మీ సమస్యలను పరిష్కరిస్తాను.రానున్న ఉప ఎన్నికల్లో నన్ను గెలిపించండని కోరారు.

గ్రామస్తుల నుండి, మహిళలనుండి మంచి స్పందన లభించినట్లు ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఓటుకు నోటు కేసు: నేడు సుప్రీం కోర్టులో విచారణ