వెడ్డింగ్ డే సందర్భంగా భార్యకు అదిరిపోయే గిఫ్ట్ ను ఇచ్చిన భర్త…!

భర్తలు వారి భార్య పై ప్రేమను చాటుకునేందుకు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే వుంటారు.

వారిని మెప్పించేందుకు ఎన్నో రకాలుగా వారికి గిఫ్ట్ ల రూపంలో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఉంటారు కొందరు భర్తలు.

మామూలుగా భార్య కోసం భర్త నగలు లేకపోతే, ఏదైనా వారికి ఇష్టమైన వాటిని కొని ఆశ్యర్యపరుస్తుంటారు.

అయితే ఓ భర్త మాత్రం వారి పెళ్లి రోజు సందర్భంగా ఏకంగా చంద్రుడిపై స్థలాన్ని కొని భార్యకు గిఫ్ట్ గా ఇచ్చాడు.

అయితే ఈ గిఫ్ట్ వినడానికి చాలా విడ్డూరంగా ఉన్నా.నలుగురికి చెప్పుకోవడానికి బాగానే ఉన్నా, కాకపోతే స్థలాన్ని వాడుకొనే అవకాశం లేకుండా పోయింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.పాకిస్థాన్ దేశంలోని రావల్పిండి లో నివసించే అహ్మద్ వారి పెళ్లి రోజు గిఫ్ట్ గా తన భార్యకు చందమామపై స్థలాన్ని కొని బహూకరించారు.

చందమామపై ' సీ ఆఫ్ వేపర్' అనే ప్రదేశం ఉన్న స్థలంలో ఆయన ఆ స్థలాన్ని కొనుగోలు చేశాడు.

అయితే ఇందుకు సంబంధించి అహ్మద్ ఇంటర్నేషనల్ ల్యూనార్ లాండ్స్ రిజిస్ట్రీలో ఆ స్థలాన్ని కేవలం రూ.

3300 కె కొనేశాడు.ఏంటి చంద్రుడిపై ఒక ఎకరం స్థలం కేవలం మూడు వేల అని అనుకుంటున్నారా.

? అవును మరి ఇంకా చంద్రుడిపై ఎవరు ఇల్లు కట్టుకోలేదు కదా.అందుకే అక్కడ ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయి.

ఇప్పటికే చాలామంది సినీ తారలు, రాజకీయవేత్తలు చంద్రుడిపై స్థలాలు కొన్నారు.అయితే ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రేరణ తీసుకున్న అహ్మద్ చంద్రుడిపై ల్యాండ్ ను కొన్నాడు.

అయితే చంద్రుడిపై ల్యాండ్ కొన్న విషయాన్ని భార్య మదీనాకు చెప్పగా.ఆవిడ తన ఫ్రెండ్స్ కు చెప్పిందంట.

అయితే ఈ విషయం విన్న ఆమె ఫ్రెండ్స్ జోకులు వద్దు అని చాలా సరదాగా తీసుకున్నారట.

అయితే చంద్రుడి పై స్థలానికి సంబంధించి పూర్తి వివరాలు తెలపగా.ఆ తర్వాత వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపించగా వాళ్ళు ఆశ్చర్యపోయారు.

ఈ విషయాన్ని పాకిస్తాన్ లోని ఓ మీడియా తెలియజేసింది.ఏది ఏమైనా పెళ్లి రోజు సందర్భంగా ఆ భర్త భార్యకు ఇచ్చిన గిఫ్ట్ నిజంగా వెరైటీ గానే ఉంది కదా.

?!.

తిరుమల చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి..!!