బంగ్లాదేశ్ పై గెలిచి సెమీస్ చేరుకున్న పాకిస్తాన్..!!

T20 వరల్డ్ కప్ టోర్నీలో ఈరోజు బంగ్లాదేశ్ జట్టుపై పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ కేవలం 127 పరుగులు మాత్రమే చేయగలిగింది.

అనంతరం బ్యాటింగ్ చేసిన పాక్ ఆటగాళ్లు 18.1 ఓవర్ లలో 128 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించడం జరిగింది.

దీంతో గ్రూప్ 2లో పాకిస్తాన్ సెమీఫైనల్ కి చేరుకుంది.బంగ్లాదేశ్ పై గెలుపుతో సెమిస్ చేరుకున్న పాకిస్తాన్.

గ్రూప్ వన్ లో న్యూజిలాండ్ టీంతో తలపడనుంది.ఇక ఈరోజు ఉదయం అతి చిన్న జట్టు నెదర్లాండ్స్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓటమి చెందటంతో.

ఎటువంటి పోటీ లేకుండానే భారత్ సెమీస్ కి చేరింది.కాగా ఈరోజు మధ్యాహ్నం జింబాబ్వేతో భారత్ మ్యాచ్ ఆడనుంది.

అనంతరం సెమీస్ లో ఇంగ్లాండ్ టీంతో పోటీ పడనుంది.మొత్తం మీద గ్రూప్ 2లో పాకిస్తాన్, భారత్ సెమీస్ చేరుకున్నాయి.

సెమీస్ లో ఈ రెండు టీములు గెలిస్తే.ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్తాన్ జరిగే అవకాశం ఉంది.

మరి సెమీస్ లో ఏం జరుగుతుందో చూడాలి.

పదేళ్లలో ఐదుగురు ఫ్లాప్ డైరెక్టర్లకు హిట్లు ఇచ్చిన యంగ్ టైగర్.. గ్రేట్ హీరో అంటూ?