మాది పార్టీల కూటమి కాదు ప్రజల కూటమి: కేజ్రీవాల్

భాజాపాకు వ్యతిరేకంగా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రతిపక్ష ఇండియా కూటమి( INDIA Alliance ) సమావేశాలు ముంబైలో ముగిశాయి.

సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కీలక నేతలు భాజపా ప్రభుత్వంపై( BJP ) నిప్పులు చేరిగారు .

అధిక ధరలతో దేశాన్నిభాజపా భ్రష్టు పట్టించిందని ఈ అధిక ధరల భూతాన్ని తప్పించుకోవాలంటే భాజపానుగద్దే దించాల్సిందే అంటూ లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శలు చేశారు.

బజాపా నేతలు భగవంతుడు కన్నా తాము గొప్పవారి మని భావిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా పనిచేసే ఏ ప్రభుత్వానికి మనుగడ ఉండదని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

మరో నేత నితీష్ కుమార్( Nitish Kumar ) మాట్లాడుతూ మోడీ సర్కారుకు పతనం మొదలైందని ,అందుకే పార్లమెంటు రద్దు లాంటి చర్యల ద్వారా ఎన్నికలను ముందస్తుగా తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తుందని.

బాజాపా ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇండియా కూటమి దానికి సిద్ధంగానే ఉందంటూ ఆయన చెప్పుకొచ్చారు.

"""/" / ఆమ్ ఆద్మీ నేత కేజ్రీవాల్( Kejriwal ) మాట్లాడుతూ ఇది పార్టీల కూటమి కాదని, బాజాపా పాలన తో విసుగు చెందిన 140 కోట్ల రక్షణ కోసం కట్టిన కూటమి అని ఇక్కడ ఎవరూ పదవుల కోసం కూటమి కట్టలేదని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసమే ఈ కలయిక అంటూ ఆయన చెప్పుకొచ్చారు .

వ్యవస్థలన్నిటిని తన రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటూ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్న భాజపాకు భారత ప్రజలు గట్టి గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ ఆయన వ్యాఖ్యానించారు.

"""/" / కేవలం ప్రజాగ్రహానికి భయపడే గ్యాస్ ధరలు ఎన్నికల సమయంలో తగ్గించారని శివసేన నేత ఉద్దవ్ థాకరే( Uddhav Thackeray ) వ్యాఖ్యానించారు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇండియా కూటమి ప్రభంజనాన్ని అడ్డుకోలేరని బిజేపి ఎత్తులన్నీ చిత్తు చేసి ఉమ్మడి గా అదికారం లోకి వచ్చి ప్రజాస్వామ్య విలువను కాపాడతామని ఆయన ఈ సందర్భంగా చెప్పుకోచ్చారు.

ఢిల్లీలో కేటీఆర్ హరీష్ బిజి… కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చూపు