మా పోరాటం బీజేపీపైనే..: రాహుల్ గాంధీ

నాగ్ పూర్ లో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.కాంగ్రెస్ పోరాటం బీజేపీపైనేనని రాహుల్ గాంధీ తెలిపారు.

దేశంలోని వ్యవస్థలు అన్నింటినీ బీజేపీ ధ్వంసం చేస్తోందని ఆరోపించారు.కొంతమంది బీజేపీలో ఉన్నప్పటికీ వాళ్ల మనసంతా కాంగ్రెస్ పైనే ఉందని తెలిపారు.

అధికారం కోసం బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు.ప్రస్తుతం బీజేపీ ఎంపీల్లో భయం కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

తమ కాంగ్రెస్ పార్టీ కిందిస్థాయి కార్యకర్త మాటను కూడా వింటుందని తెలిపారు.ఈ క్రమంలోనే కిందిస్థాయి కార్యకర్త వాయిస్ ను పెద్ద పెద్ద లీడర్లు అడ్డుకోలేరని చెప్పారు.

దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందని కొంతమంది ప్రశ్నిస్తున్నారన్న రాహుల్ గాంధీ స్వాతంత్ర్యానికి పూర్వం మన మాటకు ఎలాంటి విలువ లేదన్నారు.

ఈ క్రమంలోనే సంస్థానాలు, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడిందని వెల్లడించారు.

వేలు పెట్టకుండా ఉంటే దేవర లాంటి ఫలితాలే వస్తాయి… ప్రముఖ రచయిత షాకింగ్ కామెంట్స్!