మా కుమార్తెలు మమ్మల్ని గర్వపడేలా చేశారు.. రాజశేఖర్ జీవిత కామెంట్స్ వైరల్?

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా వరకు వారసత్వం ఎక్కువ ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇప్పటికే ఎంతోమంది వారసులు ఇండస్ట్రీలో ఉంటూ మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు.చాలా వరకు హీరోలు పరిచయం కాగా హీరోయిన్స్ కూడా కొంతవరకూ పరిచయమయ్యారు.

కానీ వాళ్లు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగలేకపోతున్నారు.కానీ వారసురాళ్లుగా పరిచయమైన రాజశేఖర్ జీవిత కూతుర్లు మాత్రం వాళ్లను గర్వపడేలా చేశారంటూ తాజాగా తమ తల్లిదండ్రులు కామెంట్లు చేశారు.

ఇప్పటికే రాజశేఖర్ పెద్ద కూతురు శివాత్మిక హీరోయిన్ గా దొరసాని సినిమాతో పరిచయమైన సంగతి తెలిసిందే.

ఇక తమ చిన్న కూతురు శివాని కూడా హీరోయిన్ గా పరిచయం అయింది.

తమ కూతుళ్లు నటించిన అద్భుతం, దొరసాని సినిమాలలో తమను గర్వపడేలా చేసినందుకు సంతోషంగా ఉందని తెలిపారు జీవిత రాజశేఖర్.

ఇక శివాని నటించిన అద్భుతం సినిమా మంచి స్పందన రావడంతో మీడియా ముందు జీవిత రాజశేఖర్ కొన్ని విషయాలు పంచుకున్నారు.

"""/"/ సక్సెస్ ను కొనలేం అంటూ కష్టపడి సాధించుకోవాలని.అద్భుతం లాంటి సినిమాతో శివానికి సక్సెస్ రావడం సంతోషంగా ఉందని తెలిపారు.

ప్రస్తుతం ఈ కామెంట్ లో నెట్టింట్లో వైరల్ గా మారాయి.ఇక శివాని మాట్లాడుతూ తాను హీరోయిన్ గా అంగీకరించిన సినిమాలు ఏదో ఒక కారణం చేత ఆగిపోతున్నాయి అంటూ.

మొత్తానికి అద్భుతం సినిమాతో తన కల నిజమైందని తెలిపింది. """/"/ తన తొలి సినిమా ఓటీటీ లో విడుదలైన కూడా మంచి స్పందన రావటం సంతోషంగా ఉందని తెలిపింది.

ఈ అద్భుతం సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు.ఇందులో తేజా సజ్జ, శివాని నటీనటులుగా నటించారు.

ఈ సినిమాను చంద్రశేఖర్ నిర్మించాడు.ఇక శివాని పరిచయం కావాల్సిన మరో రీమేక్ సినిమా ఆగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.

ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేసేలా ప్రతినిధి2 ట్రైలర్.. వైసీపీ నేతలు ఏం చేస్తారో?