మన రాజ్యాంగం ఉన్నతమైనది…అడిషనల్ కలెక్టర్ పూజారి గౌతమి

రాజన్న సిరిసిల్ల జిల్లా :75వ గణతంత్ర దినోత్సవం( Republic Day ) సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ రాజన్న సిరిసిల్ల కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ ( ఎల్ బి ) పూజారి గౌతమి( Gouthami Poojari ) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా గ్రంథాలయ పాఠకులను, విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించిమాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజ్యాంగం ( Constitution )మన భారత రాజ్యాంగం అని ,ప్రతి ఒక్కరు రాజ్యాంగ విలువలకు కట్టుబడి, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావంతో జీవిస్తూ, ఉత్తమ పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు .

ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకులు కమటం మల్లయ్య, మాధవి, గ్రంధాలయ సిబ్బంది సాయి, మహేష్, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ బీఆర్ఎస్ దూకుడు… అయోమయంలో బీజేపీ ?