తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం..!!

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం బయటపడిందని తెలుస్తోంది.తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టింది.

ఈ డ్రోన్ కెమెరాను కొందరు శ్రీవారి భక్తులే ఎగురవేశారని తెలుస్తోంది.53వ మలుపు వద్ద డ్రోన్ కెమెరాతో వీడియోలను చిత్రీకరించారు.

అయితే తిరుమలలో డ్రోన్లపై నిషేధం ఉన్నప్పటికీ భక్తులు వాటిని తీసుకువచ్చి వినియోగించారని సమాచారం.

దీంతో మిగతా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భద్రతా సిబ్బంది ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇండియన్ అల్లుడిని ఘనంగా స్వాగతించిన రష్యన్ అత్తమామలు.. వీడియో వైరల్..