నాగ చైతన్య, సమంత జంటగా సినిమా.. కథ ఏంటంటే?

టాలీవుడ్ క్యూట్ పెయిర్ నాగచైతన్య, సమంత.ఈ జంట సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా ఎంతో అందంగా ఉంటుంది.

గౌతం మీనన్ దర్శకత్వంలో ఏం మాయ చేసావే సినిమా లో జంటగా నటించి బాగా ఆకట్టుకున్నారు.

ఆ తర్వాత మనం సినిమాలో కూడా జంటగా నటించిన సంగతి తెలిసిందే.ఇక 2017 లో కుటుంబ సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

అంతే కాకుండా ఆటో నగర్ సూర్య, మజిలీ సినిమాలో కూడా జంటగా నటించి బాగా ఆకట్టుకున్నారు.

ఇదిలా ఉంటే ఈ జంట సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

వీరిద్దరూ కలిసి కొన్ని యాడ్స్ లో కూడా చేశారు.ఇక మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రానుందని తెలిసింది.

ప్రస్తుతం నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా బంగార్రాజు.కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

ఇక ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.మనం సినిమా తర్వాత ఫుల్ లెంగ్త్ పాత్రతో నాగ చైతన్య, నాగార్జున కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా గురించి కొన్ని అప్ డేట్ లు వచ్చాయి.

ఇదిలా ఉంటే ఇందులో నాగ చైతన్య సరసన సమంత నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతే కాకుండా ఇందులో చైతు భార్యగా కనిపించనుందని తెలిసింది.అఖిల్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి మనం సినిమా తరహాలో బంగార్రాజు తెరకెక్కనున్నట్లు అర్థం అవుతుంది.ఈ విషయం గురించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోగా మళ్లీ వీరి కాంబినేషన్లో సినిమా వస్తే అక్కినేని ఫ్యాన్స్ కి పండగే అని చెప్పవచ్చు.

ఈ ఒక్క హీరోకి తప్ప శృతిహాసన్ టాలీవుడ్ లో అందరికి హిట్స్ ఇచ్చింది..!