ఈనెల 21న విజయవాడలో బహిరంగ సభః ఏపీ బీజేపీ చీఫ్
TeluguStop.com
ఏపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 21న విజయవాడలో బహిరంగ సభ జరుగుతుందని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని చెప్పారు.
బీజేపీ ఎల్లప్పుడూ రాజధాని రైతులకు అండగా నిలుస్తుందన్నారు.అనంతరం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో విషయంపై చర్చ జరుగుతోందన్నారు.
నిజ నిర్ధారణపై గట్టి ప్రయత్నం జరుగుతోందని, ఏం జరుగుతుందో వేచి చూడాలని వ్యాఖ్యనించారు.
ఈ విషయంపై బీజేపీ కూడా ఢిల్లీలో మహిళా కమిషన్ కు వినతిపత్రం అందజేసిందని తెలిపారు.
జొన్న పంటలో పోషక ఎరువుల యాజమాన్యంలో పాటించాల్సిన మెళుకువలు..!