గంభీరావుపేట ఆలుమగల చెరువులో దూకి వృద్ధుడి ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఓ గీతా కార్మికుడు మంగళవారం రోజు ఆలుమగల చెరువులో పడి మృతి చెందడని మృతిని పినతల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం రోజు కేసు నమోదు చేశామని ఎస్ఐ మహేష్ తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం మండల కేంద్రానికి చెందిన సాయబు గారి ధర్మా గౌడ్(55) అనే వ్యక్తి కులువృత్తైన గీత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబన్ని పోషించేవాడు అయితే ఆరు నెలల క్రితం మానసిక క్షణికావేశంలో ఆలుమగల చెరువులో పడి మృతి చెందింది.

అయితే వీరికి ఓ కూతురు జోష్నా ఉండగా ఈటీవీలో ప్రేమ వివాహం చేసుకోగా అప్పటినుంచి మృతుడు ధర్మ గౌడ్ ఒంటరిగా ఉంటూ మానసికంగా ఆలోచించేవాడని ఇదే క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురై సోమవారం ఇంట్లో బయటకు వెళ్లేస్తానని చెప్పి తిరిగి రాకపోవడంతో మంగళవారం ఉదయం 9 గంటలకు ఆలుమగల చెరువులో ఒక మృతదేహం కనిపించడంతో అక్కడే ఉన్న మల్లయ్య అనే వ్యక్తి వీరి కుటుంబ సభ్యులకు సమాచారం ఇయ్యగా వెంటనే సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లి చూడగా మృతుడు ధర్మ గౌడ్ అని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఎస్ఐ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రి తరలించి మృతుని పినతల్లి ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడు ఉంటుందో హింట్ ఇచ్చిన మేకర్స్…