ఎమ్మెల్యేలకు ప్రలోభాల వ్యవహారంలో అధికారుల చర్యలు..!

ఫామ్ హౌజ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన వ్యవహారంలో అధికారులు దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

ఈ కేసులో రామచంద్ర భారతి, సోమయాజులు, నందకుమార్ అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే నిందితుడు నందకుమార్ కు చెందిన ఓ హోటల్ ను అధికారులు కూల్చివేస్తున్నారు.

ఫిల్మ్ నగర్ లో ఉన్న డెక్కన్ కిచెన్ హోటల్ ను జేసీబీల సాయంతో కూల్చివేస్తున్నారు.

ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హోటల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

వైరల్ : తల్లిదండ్రుల ప్రేమకు మించి మరొక ప్రేమ లేదనడానికి ఇదే ఉదహరణ కాబోలు..