పూజ సమయంలో నైవేద్యాన్ని ఇలా సమర్పించండి.. పూజ తప్పక ఫలిస్తుంది..!
TeluguStop.com
హిందూమతంలో చాలామంది రకరకాలుగా పూజలు( Pooja ) చేస్తూ ఉంటారు.దైవాన్ని బట్టి రకరకాల పదార్థాలు దేవుడికి సమర్పిస్తూ ఉంటారు.
ఇలా దైవానికి సమర్పించే సమయంలో చాలామంది తెలిసి తెలియక కొన్ని తప్పులు కూడా చేస్తూ ఉంటారు.
అయితే పూజ విధానం తెలియక పూజలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన లేని వాళ్ళు తప్పిదాలు చేస్తూ ఉంటారు.
అలాంటి వారికి నైవేద్యం పెడుతున్నప్పుడు ఎలా ఎలా పెట్టాలో కూడా తెలిసి ఉండదు.
అయితే వీటన్నిటికీ ప్రత్యేక నిబంధనలు, పద్ధతులు, సాంప్రదాయాలు ఉన్నాయి అని శాస్త్రం చెబుతోంది.
అయితే ఈ పద్ధతులు, సాంప్రదాయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. """/" /
రకరకాల ప్రసాదాలు( Prasadam ) భగవంతుడికి నైవేద్యంగా చాలామంది సమర్పిస్తూ ఉంటారు.
ప్రతి దేవతకు ఒక ప్రత్యేక పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాల్సి వస్తుంది.వాటిని ప్రసాదంగా నైవేద్యం పెడుతుంటారు.
ఇక ఏ నైవేద్యాన్ని ఎలా పెట్టాలో తెలియని వారి పూజలో లోపం జరిగి వారి పూజ ఫలించకపోవచ్చు అని పండితుల అభిప్రాయపడుతున్నారు.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రత్యేకంగా నైవేద్యాలను సమర్పించాల్సి ఉంటుంది.ఏ దైవానికి ఎలాంటి నైవేద్యం సమర్పించాలనే అవగాహన పూజ చేసుకోవడం వలన మంచి ఫలితాలు పొందవచ్చు.
విష్ణుమూర్తికి( Vishnu Murthy ) పాయసం అంటే చాలా ప్రీతికరమైనది.అందుకే చాలా మంది విష్ణుమూర్తికి పాయసం ప్రసాదంగా చెబుతారు.
"""/" /
అందుకే సేమ్యా లేదా బియ్యంతో పాలు ఉపయోగించి చేసిన పాయసాన్ని విష్ణుమూర్తికి సమర్పించాలి.
అలాగే విష్ణువుకు తులసి దళాలు అంటే చాలా ఇష్టం.అందుకే ఆయనకు తులసి దళాలను సమర్పించవచ్చు.
ఇక లక్ష్మీదేవికి( Lakshmi Devi ) కూడా ఈ ప్రసాదం అంటే చాలా ప్రతి పాత్రమైంది.
కాబట్టి లక్ష్మీ పూజలో కూడా వీటిని సమర్పించవచ్చు.శివుడికి ఉమ్మెత్త, భాంగ్పం అంటే చాలా ప్రీతిపాత్రమైనవి.
అందుకే వీటితోపాటు మిఠాయిలు లాంటివి ఏమైనా పెడితే శివుడికి చాలా ఇష్టం.అలాగే పార్వతి దేవికి పాయసం అంటే చాలా ప్రీతిపాత్రమైనవి.
ఈ విధంగా దైవానికి తమ ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టడం వలన పూజలు ఫలిస్తాయి.