అసెంబ్లీలో రచ్చ రచ్చ.. స్పీకర్‌ పైకి చెప్పులు విసిరిన బీజేపీ నేతలు.. ?

సమాజానికి సమాధానంగా, ఆదర్శంగా ఉండవలసిన నేతలు అసహనానికి లోనై, క్షణికమైన ఆవేశంలో ప్రవర్తిస్తున్న తీరు ఎన్నో సందర్భాల్లో చర్చకు దారితీసింది.

నేతల మధ్య మాటల యుద్దాలు మామూలే కానీ చేయి చేసుకోవడం, మరే ఇతర పరంగా దాడిచేయడం మాత్రం సహించని విషయం.

ఇక అసెంబ్లీ అంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం కనుగునే వేదిక ఇలాంటి ప్రదేశంలో నేతలు ప్రవర్తిస్తున్న తీరు సంచలనంగా మారుతుంది.

ఇకపోతే తాజాగా ఒడిశా అసెంబ్లీలో బీజేపీ నేతలు ఆగ్రహంతో స్పీకర్‌పైకి చెప్పులు విసరడం చర్చనీయాంశంగా మారింది.

లోకాయుక్త సవరణ బిల్లుల విషయంలో చర్చ జరపకుండా సభ ఆమోదించడం పై బీజేపీ సభ్యులు మండిపడుతూ, స్పీకర్‌ పాత్రోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పోడియం వైపు చెప్పులు, మైక్రోఫోన్‌లను విసిరారట.

ఈ ఘటనతో స్పీకర్ సభను ‌వాయిదా వేస్తూ, ముగ్గురు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు ఈ సస్పెన్షన్‌ అమల్లో ఉంటుందని, వెంటనే వారు సభలో నుండి వెళ్లిపోవాలని ఆదేశించారు.

ఎన్నికలవేళ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు..!!