అంగన్‌వాడీల్లో పోషణ మాసోత్సవాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ(Anganwadis) కేంద్రాలను నిర్వహిస్తున్నాయి.

ఫోషణ మాసం ఈ నేల 1నుండి 30 వరకు అన్ని అంగన్వాడి సెండర్లలో నిర్వహించడం జరుగుతుంది.

సోమవారం చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో ప్రారంభం చేయటం జరిగింది.ఈ కార్యక్రమం లో ఐసిడిఎస్ సూపర్వైసర్ శంకరమ్మ తల్లులకు ఫోష్కహారం పైనా అవగాహన అన్నప్రాసన చేసి కలిపించడం జరిగింది.

ఈ సందర్భంగా శంకరమ్మ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, పిల్లల ఎదుగుదల కోసం ప్రభుత్వం కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తోంది.

అయినప్పటికీ క్షేత్రస్థాయిలో రక్తహీనత, బరువు లోపాలు బయటపడుతూనే ఉన్నాయి.వీటికి చెక్‌పెట్టి, పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ సెప్టెంబరు నెలను పోషణ మాసోత్సవంగా నిర్వహిస్తోంది.

అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 2, సోమవారం 2024