ఈసారి ఇద్దరు అంటోన్న తారక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు.

ఇక ఈ సినిమాను పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాలో తారక్ పర్ఫార్మెన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, దీంతో ఈ సినిమాలో తారక్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.

ఇక ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటా ఆలియా భట్, అందాల భామ పూజా హెగ్డేలను తీసుకోవడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

గతంలోనే అరవింద సమేత చిత్రంలో పూజా హెగ్డేతో తారక్ నటించిన సంగతి తెలిసిందే.

అయితే ఆర్ఆర్ఆర్‌లో చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తుండటం, ఆమె పర్ఫార్మెన్స్‌కు తారక్ ఫిదా కావడంతో త్రివిక్రమ్‌ను ఈ సినిమా కోసం ఆమెను రికమెండ్ చేశాడట తారక్.

మొత్తానికి ఇద్దరు బ్యూటీలతో మరోసారి రొమాన్స్ చేసేందుకు తారక్ రెడీ అవుతుండటంతో ఈ సినిమాలో వారి పర్ఫార్మెన్స్‌ ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్.

కాశ్మీర్ వేర్పాటువాద జెండాలను అనుమతించొద్దు : రట్జర్స్ వర్సిటీకి ప్రవాస భారతీయ సంఘాల విజ్ఞప్తి