ఆ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్( NTR ) బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్‌ అయింది.ఒక వైపు కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో నటిస్తూ మరో వైపు బాలీవుడ్ లో వార్ 2 సినిమా( War 2 ) లో నటించేందుకు గాను ఓకే చెప్పాడు.

హృతిక్ రోషన్ ( Hrithik Roshan )హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా లో ఎన్టీఆర్‌ నటించబోతున్నాడు.

అయితే వార్ 2 లో ఎన్టీఆర్‌ పోషించబోతున్న పాత్ర విషయంలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.

అసలు విషయం ఏంటీ అంటే హృతిక్ రోషన్ హీరో గా కనిపించబోతుండగా.విలన్ పాత్ర లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడట.

గతంలో జై లవకుశ సినిమా లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ నటించిన విషయం తెల్సిందే.

ఇప్పుడు అదే తరహా లో హృతిక్ రోషన్‌ వార్‌ 2 సినిమా లో ఎన్టీఆర్ నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఆ విషయమై అభిమానులు కాస్త ఆందోళన ఉన్నారట.కారణం ఏంటి అంటే గత కొన్నాళ్లుగా ఎన్టీఆర్ ను హీరోగానే చూస్తున్నాం.

ఇలాంటి సమయంలో ఎన్టీఆర్‌ ను విలన్‌ గా చూడటం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

"""/" / గత కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారం నేపథ్యం లో ఎన్టీఆర్‌ విలన్ పాత్రలో నటించబోతున్నాడు అనేది కన్ఫర్మ్‌ అయింది.

కనుక ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఈ వార్తలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వార్ సూపర్ హిట్ మూవీ.

ఆ సినిమా సీక్వెల్‌ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటున్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను దర్శకుడు అయాన్‌ ముఖర్జీ రూపొందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

అయినా కూడా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఈ విషయంలో కాస్త ఆందోళనతో ఉన్నారు అనే పుకార్లు షికార్లు చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాడు.ఆ తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో సినిమా ను చేసేందుకు కమిట్‌ అయ్యాడు.

తాజాగా వార్‌ 2 కు కమిట్ అయ్యాడు.ఎన్టీఆర్‌ జోరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

అయితే వార్ 2 లో విలన్ అంటే మాత్రం కాస్త కంగారు పడుతున్నారు.

ఇద్దరు భారత సంతతి మహిళలకు వైట్‌హౌస్‌లో కీలక బాధ్యతలు!!