లేటెస్ట్ బజ్.. ఆ అప్డేట్ ఎన్టీఆర్ కోసమేనట.. !

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మించబోతున్నారు.

అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఎప్పటి నుండో ఒక వార్త వస్తుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ను తీసుకుంటున్నారని ఎప్పటి నుండో వస్తున్నా వార్త.

అయితే ఈ మధ్య ఇది నిజమే అని స్ట్రాంగ్ బజ్ వినిపించింది.ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా నటిస్తుందని టాక్ నడుస్తుంది.

అయితే ఈ నేపథ్యంలో కియారా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.ఆమె సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ త్వరలోనే సౌత్ సినిమాల్లోకి మళ్ళీ వస్తునట్టు మెసేజ్ షేర్ చేసింది.

దీంతో కియారా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. """/"/ దీంతో ఈ విషయంపై దాదాపు అందరికి ఒక క్లారిటీ వచ్చింది.

ఈ అప్డేట్ ఎన్టీఆర్ సినిమా కోసమే అని అందరు అనుకుంటున్నారు.కొరటాల శివ ఎన్టీఆర్ కు జోడీగా ఖచ్చితంగా కియారా ను తీసుకున్నాడంటూ వార్తలు ఇప్పుడు గట్టిగానే వినబడుతున్నాయి.

తొందరలోనే ఈ అప్డేట్ అధికారికంగా కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయించేవి..: సీఎం జగన్