రెండేళ్లు కేటాయించిన తారక్.. ఎవరి కోసమో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

కాగా కొంతమేర షూటింగ్ మిగిలి ఉండగా, ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేశారు.కాగా ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సెస్ అందుకునేందుకు తారక్-త్రివిక్రమ్ కాంబో చూస్తోంది.

అయితే ఈ సినిమా తరువాత కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ తన నెక్ట్స్ మూవీని చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ సినిమాను పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నాడప్రశాంత్ నీల్ట.

కాగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనుండటంతో ఈ సినిమా కోసం ఎక్కువ డేట్లు కావాలని దర్శకుడు తారక్‌ను కోరాడట.

దీంతో తారక్ ఈ సినిమా కోసం ఏకంగా రెండేళ్ల డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ లెక్కన త్రివిక్రమ్ సినిమా తరువాత తారక్ మరో రెండేళ్ల గ్యాప్ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించే పనిలో ఉంటాడని, అంటే ఈ సినిమాను ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం ఈ సినిమా మొదలయ్యే వరకు ఆగాల్సిందే.

కాగా తారక్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమురం భీం పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఏపీలో పొత్తుల పై ప్రధాని మోది ఏమన్నారంటే ?