పెళ్లి పేరుతో యువతిని దారుణంగా మోసం చేసిన ఎన్ ఆర్ ఐ!?

ఎన్ ఆర్ ఐ పేరుతో రైతు కుటుంబానికి టోకరా పెట్టాడు.ఎన్ ఆర్ ఐ సంబంధం అంటూ ఆ రైతు కుటుంబం నుంచి అధికమొత్తంలో కట్నం తీసుకొని నెలకూడా తిరక్కుండానే ఆ యువతిని మోసం చేసి చెక్కేశాడు.

ఈ ఘటన ఏపీ లోని గుంటూరు లో చోటుచేసుకుంది.ఎవరైనా ఎన్ ఆర్ ఐ సంబంధం అనగానే ఎగిరి గంతేస్తారు.

అందుకే ఆ రైతు కుటుంబం కూడా కాబోయే అల్లుడు ఎన్ ఆర్ ఐ అని తెలియగానే 50 నగదు,75 సవర్ల బంగారం పెట్టిమరీ చాలా గ్రాండ్ గా వివాహం జరిపించారు.

అయితే పెళ్లి అయిన మూడు రోజులకే ఆ యువకుడు 'నేను సంసారానికి పనికిరానని' ఆ యువతికి షాక్ ఇచ్చాడు.

అంతేకాకుండా పెళ్ళికి ముందు అతడికి ఒక బాయ్ ప్రెండ్ ఉన్నాడని, అతడితో కలిసి ఉండేవాడినని,కేవలం తల్లిదండ్రుల కోసం పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ఆ యువతికి తెలిపాడు.

నాతొ పాటు నిన్ను కూడా ఫారెన్ తీసుకువెళతాను అని నా బాయ్ ఫ్రెండ్ తో పాటు కలిసి ఉండొచ్చు అంటూ ఆ యువతికి పిడుగులాంటి వార్త తెలిపాడు.

ఈ ఏడాది మార్చి లో వారి వివాహం జరుగగా నెలన్నర పాటు అత్తగారింట్లో ఉన్నప్పటికీ అతడు ఎదో ఒక కారణం చెప్పి సంసార జీవితానికి దూరంగా ఉన్నాడని, అతడు అసలు గే అన్న విషయం చెప్పకుండా కేవలం కట్నం కోసమే తమని మోసం చేశారు అంటూ భాదిత యువతి ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది.

పెళ్లి అయి రెండు నెలలు కూడా కాకుండానే అతడు తిరిగి విదేశాలకు చెక్కేశాడని,ఇదేంటి అని అడిగినందుకు ఆ యువతి కుటుంబం పై యువకుడి కుటుంబసభ్యులు దాడికి దిగినట్లు యువతి తెలిపింది.

అతడు సంసార జీవితానికి పనికిరాడు అన్న విషయం ముందే తెలిసి కూడా కావాలని కట్నం కోసం పెళ్లి చేశారు అని,అతడిని అరెస్ట్ చేయాలి అంటూ బాధిత యువతి డిమాండ్ చేస్తుంది.

అయితే అతడు అసలు ఎన్ ఆర్ ఐ కాదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నట్లు ఆ యువతి చెబుతుంది.

అసలు లాక్ డౌన్ సమయంలో ఫ్లైట్స్ కూడా లేకుండా ఎలా ఫారెన్ వెళుతున్నారు,పాస్ పోర్ట్ చూపించమని యువతి తల్లిదండ్రులు ప్రశ్నించగా దానికి ఆ యువకుడి కుటుంబసభ్యులు వారిపై దాడికి దిగినట్లు తెలుస్తుంది.

గుంటూరు నగరంలోని ఆర్టీసీ కాలనీ లో చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

బీఆర్ఎస్ కు మళ్లీ గుర్తుల టెన్షన్ !