ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో బీఎల్ సంతోష్‎కు మరోసారి నోటీసులు

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్ అధికారుల దర్యప్తు కొనసాగుతోంది.దీనిలో భాగంగా బీఎల్ సంతోష్‎కు మరోసారి నోటీసులు అందించారు.

తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో 41 ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు.ఈనెల 26న లేదా 28న విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.

బీఎల్ సంతోష్ వాట్సాప్, ఈ -మెయిల్ కు సైతం సిట్ అధికారులు నోటీసులు పంపారు.

ఇదివరకే ఒకసారి నోటీసులు పంపగా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కారణంగా హాజరుకాలేదని బీజేపీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

కాలువలో భారీ కొండచిలువ.. ప్రాణాలకు తెగించి లాగేసిన యువకుడు.. వీడియో చూస్తే గుండె ఆగుద్ది!