నేను చెల్లని రూపాయి కాదు డాలర్ ని..: మాజీ మంత్రి తుమ్మల

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడపై తాను విజయం సాధిస్తానని తుమ్మల ధీమా వ్యక్తం చేశారు.

తానేమీ చెల్లని రూపాయి కాదని డాలర్ నని తెలిపారు.పువ్వాడ అజయ్ కుమారే రద్దయిన రూ.

2 వేల నోటని ఎద్దేవా చేశారు.కాగా కొన్ని రోజులుగా జిల్లాకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

తొలి సినిమాలోనే పౌరాణిక పాత్రలో మోక్షజ్ఞ.. ఈ వార్త నిజమైతే ఫ్యాన్స్ కు గూస్ బంప్స్!